తెలంగాణాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే… అయితే ఈరోజు గురువారం గాంధీ ఆసుపత్రిలో మరో కరోనా పేషేంట్ మృతి చెందాడు. అతని పరిస్థితి వికటించడంతో చనిపోయాడని గాంధీ ఆసుపత్రి సూపరింటెంట్ శ్రావణ్ తెలిపారు. అతని సోదరుకు కూడా ఇదే వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మృతుడి సోదరుడు ఆసుపత్రిలోని వైద్యులపై దాడి చేసారని వెల్లడించారు.
ఇంతటి కష్ట సమయంలో డాక్టర్లపై ఇలా వ్యవహరించడం సరికాదని తెలిపారు శ్రావణ్. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు తగిన చర్యలు చేపట్టామని వెల్లడించారు. అయితే ఇటువంటి ఘటనలు పునరావతారం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్లకు విజ్ఞప్తి చేసారు మంత్రి ఈటెల రాజేందర్. మరో వైపు వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి ఈటెల. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక వైద్యులపై దాడి చేసిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రి నుంచి చెస్ట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసారు. మృతుడితో పాటు దాడి చేసిన అతని సోదరుడు ఇద్దరు ఇటీవలే ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని అధికారులు ధ్రువీకరించారు.
గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము.
— ఈటల రాజేందర్, మంత్రి
అయితే ఈ మరణంతో తెలంగాణాలో కరోనా మృతుల సంఖ్య 7 కు చేరింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 కాగా… అందులో 76 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇవాళ్టి కరోనా వైరస్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…