భద్రాచలం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్నీ రేపు (అనగా గురువారం) నిరాడంబరంగా నిర్వచడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో ఉన్న బేడా మండపంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు శ్రీ సీతారామచంద్రులకు సమర్పించనున్నారు.
ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు కలిసి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తరువాత కల్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో భక్తులు లేకుండానే పూజారులు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని టీవిలో ప్రసారం చేయనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…