Goparaju Ramana : నాటకాలతో మొదలైన కెరీర్ సీరియల్స్, అలాగే నాటికలు, చివరికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న గోపరాజు రమణ గారు తెనాలికి చెందినవారు. ఆయన తన పదిహేనవ యేట నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అక్కినేని గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆపై ఎన్నో నాటకాల్లో నటించిన ఆయన పరుచూరి బ్రదర్స్ దగ్గర నుండి ఎన్నో బహుమతులను గెలుచుకున్నారు. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ బహుమానంగా వెండి పళ్లెం, గిన్నెలు ఇచ్చేవారు అలా కేజీ వెండి ఇప్పటికీ భద్రంగా ఉంది అంటూ చెప్పారు.

ఆ సినిమా హిట్ అయ్యుంటే కోటా గారి రేంజ్లో ఉండేవాడిని…
గోపరాజు గారు ఈటీవీలో చాలా సీరియల్స్ లో నటించారు. ఇక ఈటీవీ ఇప్పటివరకూ తన కుటుంబాన్ని ఆదుకుందని, ఇప్పుడు కూడా ఈటీవీలో ఉద్యోగం మానేయొద్దు అనే చెప్తారని వెల్లడించారు. ఇక సినిమాల్లో ‘గ్రహణం’ సినిమా ద్వారా పరిచయమైన రమణ మూర్తి గారు సాగర్ గారి దర్శకత్వంలోని ‘దేవి అభయం’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. వైవిధ్యమైన విలనిజం చూపిన ఆ సినిమా హిట్ అయ్యుంటే కోటా గారి కెరీర్ లా తన కెరీర్ ఉండేదని అభిప్రాయపడ్డారు.

ఇక ఎపుడూ డైరెక్టర్లను, రచయితలను వెళ్లి అవకాశాలు అడగలేదని అందుకే చాలా సినిమాల్లో అవకాశలు కోల్పోయానని చెప్పారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ద్వారా చాలా ఆలస్యంగా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇక గోపరాజు గారి తనయుడు విజయ్ కూడా నటుడు అలాగే దర్శకుడు. ఇక గోపరాజు గారు ఈ మధ్య కాలంలో f3, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాల్లో నటించారు.





























