సాధారణంగా కొన్ని గంటలలో వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఎన్నో వివాహాలు వాయిదా పడి రద్దయిన సంఘటనలను గురించి మనం వినే ఉంటాం. అయితే వరుడు వధువు గురించి పలు నిజాలు బయట పడటం, లేదా వారు వేరే ఎవరైనా ప్రేమించి ఉంటే వారితో వెళ్లిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు వివాహాలు రద్దు కావడం మనం చూస్తుంటాము. కానీ ఒడిశాలో రాష్ట్రంలో కేవలం పెళ్లి విందులో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
పెళ్ళిలో మటన్ కర్రీ పెద్ద తంటాను తీసుకు వచ్చింది. ఈ విధంగా పెళ్లిలో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకోవడమేకాకుండా, మరుసటి రోజే మరొక యువతిని వివాహం చేసుకున్న ఘటన జాజ్పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి విందులో భాగంగా పెళ్లి కొడుకు బంధువులు, తోడు పెళ్లి కొడుకు భోజనం చేయడానికి వెళ్లారు.
ఈ క్రమంలోనే తోడు పెళ్లి కొడుకు తనకు మటన్ కర్రీ కావాలి అని అడిగారు. అయితే వధువు కుటుంబ సభ్యులు మటన్ కర్రీ లేదని చెప్పడంతో వారిరువురి మధ్య మాటలు పెరిగి తీవ్ర వాగ్వాదానికి చోటు చేసుకుంది.వీరిరువురి మధ్య వివాదం పెద్దగా మారడంతో చివరికి వరుడు ఈ పెళ్లిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ విధంగా పెళ్లి చేసుకున్న వరుడు అతని బంధువులు కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తమ్కా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో మరుసటి రోజే ఆ యువకుడు వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…