Health News

మీకు ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే జామకాయ తినకపోవడం మంచిది.. !

జామకాయలో ముఖ్యంగా విటమిన్ – సి అనేది పుష్కలంగా ఉంటుంది. సామాన్యుడికి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కనుక దీనిని ‘సామాన్యుడి యాపిల్’ గా పిలుస్తారు. దీని ధర కూడా అతి తక్కువగా ఉంటుంది. సామాన్యుడు కూడా కొనే స్థితిలో ఉంటుంది కనుకనే దానిని సామాన్యుడి యాపిల్ గా పిలుస్తారు.

అందులో ఉండే పోషకాలకు మాత్రం విలువ కట్టలేమని అంటారు వైద్యులు. జామ పండుతో పాటు జామ ఆకులు, బెరడులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. గ్యాస్ సమస్యలతో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడుపులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. దంత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయను తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
జామపండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి. అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో… జామలోనూ అంతే ఉంటుంది. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పై సమస్యలు లేని వారు ఎంచక్కా జామకాయను తినొచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

8 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

8 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

8 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

8 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

8 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

8 hours ago