మన దేశంలో మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులు జరగడం, లేదా వరకట్న వేధింపులు కారణంగా ఎంతోమంది మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలను గురించి మనం ఎన్నో వినే ఉంటాం.. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్ అనే యువకుడికి ఐదు నెలల క్రితం శశి అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 5 నెలలకే ఈమెకు వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
వీరేంద్ర పెట్టె టార్చర్ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయినప్పటికీ అతను ఒక కొత్త కారు కొనాలనీ అందుకోసం తమ తల్లిదండ్రుల నుంచి మూడు లక్షలు అదనంగా కట్నం తేవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం తమ తల్లిదండ్రులు అప్పు చేశారని మరి కట్నం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ విధంగా వీరిరువురి మధ్య గొడవ పెరిగి పెద్దగడంతో వీరేంద్ర తన భార్యను గొడ్డును బాదినట్టు బాది తన నోట్లో యాసిడ్ పోసి ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ పోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శశిను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శశిని DCW చీఫ్ స్వాతిమాలివాల్ పరామర్శించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ రాసి నిందితులకు కఠినంగా శిక్షపడేలని తెలిపారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…