మన దేశంలో మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులు జరగడం, లేదా వరకట్న వేధింపులు కారణంగా ఎంతోమంది మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలను గురించి మనం ఎన్నో వినే ఉంటాం.. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్ అనే యువకుడికి ఐదు నెలల క్రితం శశి అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 5 నెలలకే ఈమెకు వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
వీరేంద్ర పెట్టె టార్చర్ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయినప్పటికీ అతను ఒక కొత్త కారు కొనాలనీ అందుకోసం తమ తల్లిదండ్రుల నుంచి మూడు లక్షలు అదనంగా కట్నం తేవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం తమ తల్లిదండ్రులు అప్పు చేశారని మరి కట్నం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ విధంగా వీరిరువురి మధ్య గొడవ పెరిగి పెద్దగడంతో వీరేంద్ర తన భార్యను గొడ్డును బాదినట్టు బాది తన నోట్లో యాసిడ్ పోసి ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ పోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శశిను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శశిని DCW చీఫ్ స్వాతిమాలివాల్ పరామర్శించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ రాసి నిందితులకు కఠినంగా శిక్షపడేలని తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…