బాలీవుడ్ లో ఒకవైపు స్టార్ హీరోయిన్ గా.. మరోవైపు ఐటమ్ గర్ల్ గా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అంతేకాదు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా టాలీవుడ్లో విజయం సాధించకపోయినా.. ఆమె కనిపించిన పాటకు మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది.
ఆ సినిమా తర్వాత జాక్వలిన్ పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో కనిపించేందుకు రెడీ అయింది. ఆ చిత్రం మరేదో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ దర్శకుడు క్రిష్, సంచలన నిర్మాత ఏ.ఎమ్. రత్నం కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ చిత్రం కొంత పార్ట్ షూటింగ్ని చిత్రీకరణ జరుపుకుంది. పవన్ కల్యాణ్ కరోనాకు గురికావడంతో ఈ చిత్రంతో పాటు, ఆయన చేస్తోన్న మరో చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్కి కూడా బ్రేక్ పడింది.
అంతకుముందు పవన్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి జాక్వలిన్ తన తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.”టాలీవుడ్లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాను. ఆ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ సజావుగా సాగి, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్ర షూట్లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాను.
ఆ మూవీ తర్వాత టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను..” అని జాక్వలిన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం కరోనాతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు క్రిష్ మాత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత బ్రేక్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…