బాలీవుడ్ లో ఒకవైపు స్టార్ హీరోయిన్ గా.. మరోవైపు ఐటమ్ గర్ల్ గా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అంతేకాదు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా టాలీవుడ్లో విజయం సాధించకపోయినా.. ఆమె కనిపించిన పాటకు మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది.
ఆ సినిమా తర్వాత జాక్వలిన్ పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో కనిపించేందుకు రెడీ అయింది. ఆ చిత్రం మరేదో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ దర్శకుడు క్రిష్, సంచలన నిర్మాత ఏ.ఎమ్. రత్నం కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ చిత్రం కొంత పార్ట్ షూటింగ్ని చిత్రీకరణ జరుపుకుంది. పవన్ కల్యాణ్ కరోనాకు గురికావడంతో ఈ చిత్రంతో పాటు, ఆయన చేస్తోన్న మరో చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్కి కూడా బ్రేక్ పడింది.
అంతకుముందు పవన్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి జాక్వలిన్ తన తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.”టాలీవుడ్లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాను. ఆ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ సజావుగా సాగి, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్ర షూట్లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాను.
ఆ మూవీ తర్వాత టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను..” అని జాక్వలిన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం కరోనాతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు క్రిష్ మాత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత బ్రేక్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట..!!
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…