Hari krishna: నందమూరి తారకరత్న మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా నందమూరి నారా కుటుంబంలో తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇలా నందమూరి కుటుంబంలో ప్రతి ఏడాది ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడంతో అసలు నందమూరి కుటుంబానికి ఈ శాపం ఏంటి అని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ జానకిరామ్ తారకరత్న వంటి వారందరూ కూడా వరుసగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇక తారకరత్న ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈయన పాదయాత్రలో భాగంగా ఒక్కసారి గుండెపోటు రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్, హరికృష్ణ, జానకిరామ్, తారకరత్న నందమూరి వంశస్థులు ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోకి గాను బ్యాక్ గ్రౌండ్లో హరికృష్ణ చెప్పిన డైలాగ్స్ రూపొందించడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో నందమూరి అభిమానులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ వీడియోలో భాగంగా హరికృష్ణ మాట్లాడుతూ… మనం బ్రతికేది నాలుగు రోజులు అయినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతకాలి. ఎవరైనా ఎదుటివారు మనల్ని చేయి చాచి యాచిస్తే ఎప్పుడు కూడా మన చేయి పైనే ఉండాలే తప్ప కింద ఉండకూడదు.పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఇక సెలవు అంటూ హరికృష్ణ చెప్పినటువంటి ఈ డైలాగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…