Pavithra Lokesh: ఆయన నా భర్త కాదు..కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.. పెళ్లిపై పవిత్ర లోకేష్ క్లారిటీ?
Pavithra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు షికార్లు చేశాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.
ఈ విధంగా వీరిద్దరి గురించి పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి పవిత్ర లోకేష్ ఒక కన్నడ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నానని మా ఇద్దరి రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ అనుమతి ఉండటం వల్లే మేమిద్దరం సహజీవనం చేస్తున్నామని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం నరేష్ ఫామ్ హౌస్ లో మేము ఉంటున్నామని పవిత్ర వెల్లడించారు.
ఇక నరేష్ మూడో భార్య గురించి ఈమె మాట్లాడుతూ ఆమె సరిగా ఉంటే కృష్ణ గారి కుటుంబం తనకే మద్దతు తెలిపేదని తనుభర్తతో కలిసి ఉండనని తెగేసి చెప్పడం వల్లే వారిద్దరు విడిపోయారని పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య గురించి తెలిపారు. ఇకపోతే ఈమె మొదటి భర్త గురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి భర్త కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించారు.
సుచేంద్ర ప్రసాద్ అసలు తన భర్తే కాదని, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం మేమిద్దరం రిలేషన్ లో మాత్రమే ఉన్నామని మాకు పెళ్లి జరగలేదని తెలిపారు. పెళ్లి జరగనప్పుడు విడాకులు ఎలా వస్తాయి అంటూ ఈమె వెల్లడించారు. ఇలా పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ గురించి, ఆయనతో ఉన్న సంబంధం గురించి చెప్పడమే కాకుండా నరేష్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…