పాలల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. పాలను మనం వివిధ రూపాల్లో ఉపయోగించుకుంటాం.. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యిలాగా తీసుకుంటాం. అయితే కొంతమందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి.. వాటిని తీసుకోవడం వల్ల నష్టం ఉందా.. అనే విషయాలను తెలుసుకుందాం..
పాలను కాచి చల్లార్చి తాగితేనే మంచిదట.. పచ్చి పాలు తాగడం వల్ల అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్లస్థాయి పెరుగుతందట. దీంతో ఎసిటిటీతో పాటు గ్యాస్ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు.
అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు అస్సలు తీసుకోవద్దు అంటూ నిపుణులు తెలుపుతున్నారు. పాలల్లో ఉండే బాక్టీరియా కాచి చల్లార్చకపోతే అలానే ఉంటుందట.. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. అయితే దీంతో ఎక్కువగా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు నిపుణులు.
పచ్చి పాలల్లో ఉండే బ్యాక్టీరియాలు తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. పల్లెటూర్లలో ఎక్కువ శాతం పాలు పితికే సమయంలో అందులో కొంచెం నీళ్లను కూడా కలుపుతారు. అందులో వాటితో పాటు మలినాలు కలిసే అవకాశం ఉంటుంది. దీంతో ఉదరానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…