పాలల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. పాలను మనం వివిధ రూపాల్లో ఉపయోగించుకుంటాం.. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యిలాగా తీసుకుంటాం. అయితే కొంతమందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి.. వాటిని తీసుకోవడం వల్ల నష్టం ఉందా.. అనే విషయాలను తెలుసుకుందాం..
పాలను కాచి చల్లార్చి తాగితేనే మంచిదట.. పచ్చి పాలు తాగడం వల్ల అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్లస్థాయి పెరుగుతందట. దీంతో ఎసిటిటీతో పాటు గ్యాస్ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు.
అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు అస్సలు తీసుకోవద్దు అంటూ నిపుణులు తెలుపుతున్నారు. పాలల్లో ఉండే బాక్టీరియా కాచి చల్లార్చకపోతే అలానే ఉంటుందట.. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. అయితే దీంతో ఎక్కువగా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు నిపుణులు.
పచ్చి పాలల్లో ఉండే బ్యాక్టీరియాలు తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. పల్లెటూర్లలో ఎక్కువ శాతం పాలు పితికే సమయంలో అందులో కొంచెం నీళ్లను కూడా కలుపుతారు. అందులో వాటితో పాటు మలినాలు కలిసే అవకాశం ఉంటుంది. దీంతో ఉదరానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…