Heart Attack: ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య ఒకటి. గతంలో 50 సంవత్సరాలకు పైబడిన వారు ఇలాంటి సమస్యతో బాధపడేవారు కానీ ఇప్పుడు 10 సంవత్సరాల వయసులోపు వారు కూడా ఈ గుండెపోటు సమస్యతో బాధపడుతూ మరణిస్తున్నారు. తాజాగా మూడో తరగతి చిన్నారి పాఠశాలలో ఉన్నఫలంగా కుప్పకూలి పడిపోయిన ఘటన ఎంతో హృదయ విధారకంగా మారింది.
అహ్మదాబాద్లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్లో గార్గి అనే 8 ఏళ్ల చిన్నారి మూడో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే రోజు పాఠశాలకు వచ్చింది అయితే ఆమె పాఠశాలకు వచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఇలా గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో చిన్నారి గార్గి ఒకసారిగా కుప్పకూలి పడిపోయారు. ఇలా ఆ చిన్నారి పడిపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే గమనించి చిన్నారిని స్థానిక జైడస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హాస్పిటల్ కి తీసుకెళ్లిన చిన్నారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఇలా ప్రాథమిక చికిత్స జరుగుతున్న నేపథ్యంలోనే చిన్నారి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఈమె గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.గార్గి అస్వస్థతకు గురవడాన్ని సీసీటీవీ ఫుటేజీలో చూశామని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శర్మిష్ట సిన్హా తెలిపారు. అయితే చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు.
ముంబైకు చెందిన గార్గి అహ్మదాబాద్లో తన తాతయ్యలతో కలిసి నివసిస్తోంది. పాప మృతి పట్ల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు సంతాపం తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…