Jeeva: డైరెక్టర్ మహీవి రాఘవ్ దర్శకత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందు యాత్ర సినిమా ద్వారా వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వంటి విషయాలను కూడా ఈ సీక్వెల్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇకపోతే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్ముట్టి నటించారు. అదేవిధంగా వైయస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించారు. ఇక ఈ సినిమాలో జీవా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించడం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
ఇలా జగన్ పాత్రలో నటించినందుకు జీవా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో ఈయన జగన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కొన్ని చోట్ల ఈయనకు బదులు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాము అనే భావన కూడా ప్రేక్షకులలో కలుగుతుందని చెప్పాలి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి..
ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించినటువంటి నటుడు ముమ్ముటికి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించారు. ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్లడం సిబిఐ విచారణ అరెస్ట్ కావడం బయటకు వచ్చి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం తిరిగి పాదయాత్ర జగన్ ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలను చూపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…