Nikhil: టాలివుడ్ యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమా ద్వార ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా ద్వారా నిఖిల్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత యువత, వీడు తేడా, కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాల ద్వారా హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా 2014 లో విడుదలై మంచి హిట్ అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా ద్వారా నిఖిల్ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమా విడుదల చేయటం కోసం ఈ సినిమా నిర్మాతలు దర్శకుడు చాలా అవస్థలు పడవలసి వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో నిఖిల్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కోసం సీరియల్స్ లో కూడా సందడి చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమా విడుదల చేయడం కోసం వారు పడ్డ అవస్థలు గురించి కూడా వివరించాడు.
ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ..కార్తికేయ 2 విడుదల చేయటానికి ఎన్నో అవస్థలు పడ్డాము. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను పట్టించుకోరు. మా సినిమా పరిస్థితి కూడా అలాగే ఉండేది. సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 12 అని ప్రకటించే సమయంలో కూడా ఆ డేట్ వద్దని చెప్పి అక్టోబర్ , నవంబర్ కు పోస్ట్ ఫోన్ చేసుకోండి . ఇప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు థియేటర్లు ఇవ్వము అని అన్నారు. దీంతో సినిమా ఆగిపోతుందని ఒక సమయంలో ఎడ్చేశాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదల విషయంలో చాలా అవస్థలు ఎదుర్కొని ఎట్టకేలకు ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాము అంటూ నిఖిల్ వెల్లడించాడు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…