హీరొయిన్ బిందు మాధవి.. ఈ భామ అందరికి పరిచయమే.. తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాలు చేసింది. తెలుగమ్మాయి అయిన బిందు మాధవి టాలీవుడ్ లో “ఆవకాయ బిర్యానీ” అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తరువాత హీరో రామ్ నటించిన “రామ రామ కృష కృష్ణ” చిత్రంలో హీరో రామ్ కు మరదలి పాత్రలో ఆదరగోట్టింది. అయినా తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం చెన్నై లో నివాసముంటుంది.
కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ ప్రభావం బిందు మాధవిని కూడా తాకింది. చెన్నై లో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో ఒకరి వ్యక్తికీ కరోనా పాజిటివ్ ఆని నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో అక్కడి అధికారులు రంగంలోకి దిగి ఆ అపార్ట్మెంట్ ని సీల్ చేశారు. ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారందరిని క్వారంటైన్ లో ఉంచారు. మరోవైపు బిందు మాధవి కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాల్సివచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా బింధుమాధవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు తెలిపింది. మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికీ కరోనా సోకిందని, దీనితో మేము అందరం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాం. మరో 14 రోజుల పాటు తానూ క్వారంటైన్ లో ఉండనున్నట్టు హీరోయిన్ బిందు మాధవి తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…