Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎంసిఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జి గా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
చిరంజీవితో నటించే అవకాశం పోయింది…
సినిమాల్లో నటిస్తే హీరోయిన్ గానే నటించాలి అని ఇండస్ట్రీకి వచ్చిన ఆమని మొదట్లో బాగా ఇబ్బందులు పడినా చివరకు సినిమాల్లో హీరోయిన్ గానే తన కెరీర్ మొదలు పెట్టింది. అలా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన ఆమనికి మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టమట. తన డ్రీమ్ హీరో చిరునే అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన ఆమని ఆయనతో కలిసి నటించే అవకాశం రిక్షావోడు సినిమాలో రావడంతో హ్యాపీగా ఫీల్ అయిందట. అయితే సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే డైరెక్టర్ మార్పు జరగడంతో ఆమని ప్లేసులో లో నగ్మా ను తీసుకున్నారట. దాంతో ఆమని గారు చిరుతో నటించే అవకాశం కోల్పోయారు. సౌందర్య, ఆమని ఇద్దరూ మంచి స్నేహితులు కాగా అప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలను చేసారు. మరోసారి మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది అని సౌందర్య కాల్ చేసి మరీ చెప్పిందట.
కానీ ఆమని నటించడం లేదని తెలిసీ మళ్ళీ కాల్ చేసి నువ్వయ్యుంటే బాగుండేది కానీ మిస్ అయింది. మళ్ళీ ఇద్దరం కలిసి వేరే సినిమాలో కలిసి పనిచేయాలి అని చెప్పిందట. నువ్వు ఫీల్ అవ్వకు ఈ సినిమా మిస్ అయిందని అని చెప్పిందట సౌందర్య. ఇక చిరంజీవి అక్కగా స్టాలిన్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఆమని చేయలేదట. చేస్తే చిరు పక్కన హీరోయిన్ గానే చేయాలని డిసైడ్ అయిన ఆమని అక్కగా చేయనని చెప్పారట. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా ఏజ్డ్ చిరు క్యారెక్టర్ కి భార్య పాత్ర అయిన సరే చేస్తానని చెప్తోంది. ఏది ఏమైనా చిరు పక్కన హీరోయిన్ గా లేదా భార్యగానే నటిస్తాను అంటూ క్లారిటీ ఇస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…