Anjali: వెండి తెరపై సీతగా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అంజలి ఒకరు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే అంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గీతాంజలి అనే హర్రర్ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా అంజలి తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈమె ఇదివరకు తమిళ హీరోని ప్రేమించిందని అయితే తనని మోసం చేశారు అంటూ వార్తలు వచ్చాయి. అదే విధంగా ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది అంటూ కూడా ఈమె పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అంజలి పెళ్లి వార్తలపై స్పందించారు.
ఎన్నిసార్లు నాకు పెళ్లి చేస్తారు..
ఈ సందర్భంగా అంజలి తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తన పెళ్లి గురించి తనకు తెలియకుండానే ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని తెలిపారు. నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యానంటూ కూడా వార్తలు రాశారు. నాకు తెలియకుండానే అందరూ నా పెళ్లిని చేసేస్తున్నారు. ఈ వార్తలను చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ ఈమె పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…