వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. ఆమె పాదయాత్ర సమయంలో ఒక ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. షర్మిల పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగల గుంపు ఆమె టీం పై దాడి చేసాయి. ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు వెళ్తుండగా చోటుచేసుకుంది.
ఒక చెట్టుకింద గ్రామవాసులతో మాట్లాడుతున్నా సమయంలో తేనెటీగల గుంపు అకస్మాత్తుగా షర్మిలపై దాడి చేసాయి. ఈ క్రమంలో షర్మిల సెక్యూరిటీ సిబ్బంది ఆమె చుట్టూ నిల్చొని కండువాలతో తేనెటీగలను కొడుతూ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళారు. ఈ దాడి నుండి షర్మిల క్షేమంగా బయటపడ్డారు. కానీ పార్టీ కార్యకర్తలు, ఆమె సిబ్బందిలో కొందరికి గాయాలయ్యాయి. కాస్త విరామం తీసుకుని తిరిగి మళ్ళీ పాదయాత్రను ప్రారంభించారు షర్మిల. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…