Surekha Vani: ఈ అమ్మని విడిచి ఎలా వెళ్లాలనిపించింది… ప్లీజ్ తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖవాణి!
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. యూట్యూబ్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నట గాయత్రి హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా గాయత్రి మృతిచెందడంతో యూట్యూబ్ స్టార్స్ ఆమె మృతిపై ఎమోషనల్ అవుతూ తన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెట్టారు. ఇకపోతే నటి గాయత్రితో సురేఖ వాణికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే గాయత్రి మరణవార్త తెలిసిన వెంటనే సురేఖవాణి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆమె మరణించి మూడు రోజులు అయినప్పటికీ సురేఖవాణి ఇంకా ఆ బాధ నుంచి బయట పడలేదు.
ఇక తాజాగా సురేఖవాణి గాయత్రిని తలుచుకొని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది నేను నమ్మలేకపోతున్నాను మనిద్దరం కలిసి ఎన్నో పార్టీలు చేసుకోవాలి ప్లీజ్ తిరిగి రా గాయత్రి అంటూ ఎమోషనల్ అయ్యారు. మనిద్దరం కలిసి ఇంకా ఎన్నో జ్ఞాపకాలను పెను వేసుకోవాలి. ఇది సరైన సమయం కాదు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ విధంగా గాయత్రి మరణం పై సురేఖ వాణి ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గాయత్రి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు రీల్స్ చేయడం వీడియోస్ చేయడంతో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఒకానొక సందర్భంలో గాయత్రీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటగా సురేఖవాణితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. సురేఖ వాణి తన సెకండ్ మదర్ అంటూ వారి మధ్య ఉన్న అనుబంధం గురించి గాయత్రి వెల్లడించారు. ప్రస్తుతం సురేఖవాణి కూడా అదే బంధంతో ఆమె మృతి పట్ల ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…