Surekha Vani: ఈ అమ్మని విడిచి ఎలా వెళ్లాలనిపించింది… ప్లీజ్ తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖవాణి!
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. యూట్యూబ్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నట గాయత్రి హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా గాయత్రి మృతిచెందడంతో యూట్యూబ్ స్టార్స్ ఆమె మృతిపై ఎమోషనల్ అవుతూ తన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెట్టారు. ఇకపోతే నటి గాయత్రితో సురేఖ వాణికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే గాయత్రి మరణవార్త తెలిసిన వెంటనే సురేఖవాణి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆమె మరణించి మూడు రోజులు అయినప్పటికీ సురేఖవాణి ఇంకా ఆ బాధ నుంచి బయట పడలేదు.
ఇక తాజాగా సురేఖవాణి గాయత్రిని తలుచుకొని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది నేను నమ్మలేకపోతున్నాను మనిద్దరం కలిసి ఎన్నో పార్టీలు చేసుకోవాలి ప్లీజ్ తిరిగి రా గాయత్రి అంటూ ఎమోషనల్ అయ్యారు. మనిద్దరం కలిసి ఇంకా ఎన్నో జ్ఞాపకాలను పెను వేసుకోవాలి. ఇది సరైన సమయం కాదు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ విధంగా గాయత్రి మరణం పై సురేఖ వాణి ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గాయత్రి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు రీల్స్ చేయడం వీడియోస్ చేయడంతో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఒకానొక సందర్భంలో గాయత్రీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటగా సురేఖవాణితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. సురేఖ వాణి తన సెకండ్ మదర్ అంటూ వారి మధ్య ఉన్న అనుబంధం గురించి గాయత్రి వెల్లడించారు. ప్రస్తుతం సురేఖవాణి కూడా అదే బంధంతో ఆమె మృతి పట్ల ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…