కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన
స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లు సైతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆడపిల్లల భవిష్యత్ కు భద్రత కల్పించడానికి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఇతర స్కీమ్ లతో పోల్చి చూస్తే ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎక్కువ మొత్తం వడ్డీని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేర్లపై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుండగా కేవలం 250 రూపాయలతో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.
ఆడపిల్ల బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా సులభంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ లో చేరితే మెచ్యూరిటీ కాలంలో 26 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.
ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా డిపాజిట్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీస్ కు వెళ్లకుండా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సులభంగా ఆటోమేటిక్ డెబిట్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…