అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచి కష్టసుఖాలలో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనను వదిలి, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ యువతి బాధ వర్ణనాతీతం. ఈ భూమి పై తన భర్త ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేని ఆ భార్య తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన కిరణ్ (30), పూజా (22)లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితాన్ని చూసి రెండు కుటుంబాల పెద్దలు ఎంతో సంతోషించేవారు. అయితే ఆ సంతోషం వారిలో ఎక్కువ కాలం నిలవలేదు. వీరి సంతోషం చూసి ఎవరికి అసూయ పుట్టిందో ఏమో కానీ మృత్యువు రూపంలో వీరి సంతోషాన్ని కబలించింది.
శుక్రవారం ఉన్నఫలంగా కిరణ్ కి గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ శనివారం ఉదయం మరణించడంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
తాను ఎంతగానో ప్రేమించే తన భర్త మరణ వార్తను భార్య పూజ తట్టుకోలేకపోయింది. తన భర్త లేడన్న చేదు వార్తను దిగమింగే లేక తన భర్తను అంత్యక్రియలకు తీసుకు వెళ్ళగానే తాను ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా తన బిడ్డలిద్దరిని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ షాక్ నుంచి తేరుకున్న కుటుంబసభ్యులు కొంత సమయానికి పూజ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…