మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంటే మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందా? ఈ విధంగా మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.12 కట్ అయినట్లు మెసేజ్ వస్తే మీకు రూ.2 లక్షల రూపాయల బెనిఫిట్ కలిగినట్టే. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఈ బెనిఫిట్ మీరు పొందలేకపోతున్నట్టు. మే 31లోగా మీ ఖాతా నుంచి రూ. 12 కట్ అయితే మీరు ఈ పథకానికి అర్హులు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి ప్రతి సంవత్సరం మే నెలలో మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.12 కట్ చేస్తారు. ఈ విధంగా కట్ చేయడం వల్ల మీరు రెండు లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే మీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల బీమా వర్తిస్తుంది. మరణించిన లేక ప్రమాదవశాత్తు ఏదైనా అంగవైకల్యం ఏర్పడిన ఈ బీమా పథకం ద్వారా రెండు లక్షలను పొందవచ్చు.
ఇప్పటివరకు ఈ పథకంలో చేరని వారు సరాసరి బ్యాంకుకు వెళ్లి ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు. ఈ విధంగా ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం మే నెలలో పన్నెండు రూపాయలు కట్ అవుతాయి. ఈ విధంగా మన బ్యాంకు ఖాతా నుంచి రూ.12కట్ అయినట్లు మనకు మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం భీమా పథకానికి అర్హులని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో చేరాలనుకునే వారు ఇప్పుడే మీ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లి ప్రమాద బీమా పథకంలో చేరవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…