ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పిల్లలు కాలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు తన భర్త పొట్టి దుస్తులు వేసుకొని తన ముందు నిలబడి ఫొటోలు దిగాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆమె బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016 సంవత్సవరంలో ఎంబీఏ పూర్తి చేసిన సదరు మహిళ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నివాసం ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఆసక్తి ఉండటంతో ఆ కోర్సులో చేరింది. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని గన్రాక్ ఎన్క్లేవ్లో ఉంటున్న మహ్మద్ ఫర్హాన్(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడినే 2017 సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకుంది.
ఆ సమయంలో అతడికి రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు. పెండ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అలాగే ఆమె ఇంట్లోనే ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ ఉంది. తన భర్త లోదుస్తుల్లో తనకు కనిపించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
అలా వీడియోలు, ఫొటోలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. ఇంకా తనకు అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం.. లేకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. మరొ పక్క అత్తమామల పోరు భరించలేక ఆమె బంజారాహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…