సాధారణంగా మన భారతదేశంలో పెళ్లైన స్త్రీలు మాత్రమే మెడలో తాళిని ధరిస్తారు. కానీ ఆ తాళిని మగవారు ధరించడం మీరు ఎప్పుడైనా చూసారా.ఏంటి తాళి మగవాళ్ళు ధరించడం అంటే అందరికీ మన తెలుగు సినిమా జంబలకడిపంబ గుర్తుకొస్తుంది. ఈ విధంగా సినిమాలలో మగవారు తాళిని వేసుకోవడం చూసాము కానీ నిజజీవితంలో ఆడవారు మాత్రమే తాళిని ధరిస్తారు.కానీ పుణేకు చెందిన ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా వరుడు కూడా తాళిని ధరించి అందరిని ఆశ్చర్య పరిచాడు.
పుణేకు చెందిన ఓ జంటకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం జరిగింది. కాలేజీ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఇద్దరు ప్రేమించుకున్న ఈ జంట మహారాష్ట్ర పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి మంగళ సూత్రం ధరించినప్పుడు తాను కూడా మంగళ సూత్రం ధరించడంలో ఏ మాత్రం తప్పులేదని భావించిన వరుడు తన మెడలో కూడా మంగళసూత్రం ధరించాడు.
ఈ విధంగా అమ్మాయి చేత తాళి కట్టించుకొన్న అబ్బాయి తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అబ్బాయిల పరువు మర్యాదను తుంగలో తొక్కారని కొందరు భావించగా, మరికొందరు పాపులర్ కావడానికి ఈ విధంగా చేశాడని భావించారు. కానీ ఈ మాటలన్నీ ఆ యువకుడు మాత్రం పట్టించుకోలేదు.
ఈ సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం అయినప్పుడు అమ్మాయిలు ధరించే తాళి అబ్బాయిలు ఎందుకు ధరించకూడదని వాదించాడు. అమ్మాయిలు భర్త క్షేమం కోసం తాళి ధరించినప్పుడు, భార్య క్షేమం కోసం భర్త తాళి ధరిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. ఏదిఏమైనా ఈ జంట ఇద్దరు తాళి ధరించడం పట్ల కొందరు సానుకూలంగా ప్రవర్తిస్తే మరి కొందరు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…