General News

కరోనా వేళా.. వైసీపీ ఎమ్మెల్యే పెద్ద మనసు?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.చివరికి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో శవాలు శవాగారంలోనే ఉండిపోయాయి. ఈ విధంగా అనాధలుగా మిగిలిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలను నిర్వహించడానికి తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.

కరోనా మొదటి వేవ్ లో చనిపోయిన ఎంతోమందికి దహన సంస్కారాలను నిర్వహించిన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్నో శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగా తమ వంతు సహాయం చేస్తూ ప్రజల్లో ఎంతో అవగాహన చేపడుతున్నారు. తాజాగా తిరుపతిలో బుధవారం
రుయా మార్చురీలో కోవిడ్ వల్ల చనిపోయిన 21మందికి సాంప్రదాయ రీతిలో దహన సంస్కార కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.గత ఏడాది తన మిత్రులు, సహచరులు ముస్లిమ్ జేఎసి గా ఏర్పడి అన్నీతామై నేటివరకు 501 మృతదేహాలకు అంతిమ క్రియలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఎమ్మెల్యేగా తన వంతు భాద్యతగా ఈ దహన సంస్కారాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం 21 ఒక్క శవాలకు పూలమాలను వేసి వారి సంప్రదాయ పద్ధతులలో అంత్యక్రియలు నిర్వహించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago