దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.చివరికి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో శవాలు శవాగారంలోనే ఉండిపోయాయి. ఈ విధంగా అనాధలుగా మిగిలిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలను నిర్వహించడానికి తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.

కరోనా మొదటి వేవ్ లో చనిపోయిన ఎంతోమందికి దహన సంస్కారాలను నిర్వహించిన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్నో శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగా తమ వంతు సహాయం చేస్తూ ప్రజల్లో ఎంతో అవగాహన చేపడుతున్నారు. తాజాగా తిరుపతిలో బుధవారం
రుయా మార్చురీలో కోవిడ్ వల్ల చనిపోయిన 21మందికి సాంప్రదాయ రీతిలో దహన సంస్కార కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.గత ఏడాది తన మిత్రులు, సహచరులు ముస్లిమ్ జేఎసి గా ఏర్పడి అన్నీతామై నేటివరకు 501 మృతదేహాలకు అంతిమ క్రియలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఎమ్మెల్యేగా తన వంతు భాద్యతగా ఈ దహన సంస్కారాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం 21 ఒక్క శవాలకు పూలమాలను వేసి వారి సంప్రదాయ పద్ధతులలో అంత్యక్రియలు నిర్వహించి తన గొప్ప మనసును చాటుకున్నారు.



























