సూపర్ మార్కెట్లు, షాపింగ్ సెంటర్లలో వినియోగదారుడి నుంచి క్యారీ బ్యాగుకు అదనపు రుసుం వసూలు చేయడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కన్జ్యూమర్ ఫోరం.
ఇటీవల హైదర్ గూడలోని డీమార్ట్ షాపింగ్ మాల్ ఓ వినియోగదారుడికి క్యారీ బ్యాగు కింద రూ. 3.50 వసూలు చేసింది. దీంతో సదరు వినియోగదారుడు తార్నాకకు చెందిన భగేల్కర్ ఆకాష్ కుమార్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఈ కేసుపై వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది.
వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడం తో పాటు పరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. అలాగే.. న్యాయ సేవాకేంద్రానికి మరో వెయ్యి రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్ ను ఆదేశించింది కోర్టు. ఇప్పటి నుండి ఎలాంటి క్యారిబ్యాగ్ కు డబ్బులు వసూలు చేయద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం. డీమార్టే కాకుండా నగరంలోని చాలా వ్యాపార సముదాయాలు సరుకులు కొన్న తర్వాత వాటికి అవసరమయ్యే క్యారీ బ్యాగులకు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు బ్యాన్ తరువాత నుంచి పలు షాపింగ్ మాల్స్ ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పుతో అయినా షాపింగ్ మాల్స్ ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…