భర్తతో చిన్నచిన్న గొడవలు చోటుచేసుకున్నాయి. వారిద్దరిది ప్రేమ వివాహం. ఆ రోజు ఆమె భర్తతో చిన్న గొడవపడింది. క్షణికావేశంలో అతడిపై కోపంతో ఆత్మహత్యకు సిద్ధమైంది. దానికి మొదట ఆమె దేవుడికి పూజ చేయడానికి సిద్దపడింది. హరతిని ఇచ్చే క్రమంలో హారతి ఆరిపోయింది. నదుట మీద కుంకుమతో బొట్టు పెట్టుకునే ప్రయత్నంచేసింది.
కానీ అక్కడ కుంకుమ భరణి మొత్తం కిందపడిపోయింది. ఇవి అపశకునాలేనని.. తన ఆయుష్షు తీరిందని ఆమె భావించింది. అంతే.. సెల్ఫీ వీడియో తీసుకొని తనువు చాలించింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, కబితలు 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు.
వీరు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 78 సమీపంలోని అంబేడ్కర్ నగర్లో ఓ ఇంటి మూడో అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి ఉంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓంప్రకాశ్ తన కూతురును తీసుకొని వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య ఫ్యాన్ ఉరేసుకొని మరణించడం చూసి అతడు తట్టుకోలేకపోయాడు.
అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని విచారించగా చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందని తెలిపారు. ఆమె ఫోన్ ను పరిశీలించగా సెల్ఫీ వీడియో ద్వారా కారణాన్ని తెలుసుకున్నారు. దీంతో ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…