బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచులతో అలరిస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్. ఈ షో వలన చాలా మంది కామెడియన్ లు వెండితెరకి పరిచయం అవడం జరిగింది. అక్కడ కూడా కామిడీయన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ లో హైపర్ ఆది అంటే పంచులకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పొచ్చు. అతని కామెడీ టైమింగ్ తో మంచి స్క్రిప్ట్ లు చేస్తుంటాడు హైపర్ ఆది. కానీ జబర్దస్త్ లో చాలా వరకు వల్గారిటీ ఉంటుందనే ఉంటుందనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ షో కాదు అని అనేవాళ్ళు ఉన్నారు.
అంతే కాకుండా హైపర్ ఆది టీమ్ లో సభ్యులుగా ఉన్న దొర బాబు, పరదేశి మొన్నీమధ్యనే సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటువంటి వల్గర్ కామెడీలు షోలోనే కాకుండా నిజజీవితంలో కూడా చేస్తున్నారు అనే భావన జనాల్లో బలంగా ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత హైపర్ ఆది టీమ్ కి కాస్త నష్టం వాటిల్లింది అనే చెప్పొచ్చు. ఆది టీమ్ కి ఈ సెక్స్ రాకెట్ పెద్ద తలనొప్పిగా తయారైంది. మరోవైపు దీని ప్రభావం హైపర్ ఆది టీమ్ మీదే కాదు మొత్తం జబర్దస్త్ షో మీద కూడా ప్రభావం చూపింది. వైజాగ్ లో వ్యభిచారం చేస్తూ పోలీస్ లకి చిక్కిన దొరబాబు, పరదేశిలు జబర్దస్త్ నటులు కావడం వలన వార్తల్లో పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీనిపై మహిళలు మరియు ఇతర మహిళ సంఘాలు సైతం ఇటువంటి వాటిని ఖండించాలి అని కోరడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ నటులు జబర్దస్త్ లో నటిస్తూ ఉందాత్మతో జనాల్లో కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది.
ఇపుడు దేశంవ్యాప్తంగా లాక్ డౌన్ కొసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం టీవీ ఇండస్ట్రీ మీద కూడా పడింది.. దీనితో అన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి. జబర్దస్త్ యాజమాన్యం సైతం అన్ని బాగుంటే జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ షూటింగ్స్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంది. అయితే కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు మూత పడడంతో ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందువలన జబర్దస్త్ యాజమాన్యం కూడా టీమ్ లలో ఉండే నటులను తగ్గించాలనే ఆలోచన చేశారట, దానికి అనుగుణగానే టీమ్ లీడర్స్ కి టీమ్ లో కొంత మంది నటులను తొలగించాలని చెప్పారట. ఇందులో భాగంగానే దొరబాబు చేసిన పని వలన తన టీమ్ కి నష్టం జరిగినదని భావించిన హైపర్ ఆది మేనేజ్మెంట్ చెప్పిన విధంగా తన టీమ్ నుండి దొరబాబు, పరదేశి లను తొలగించి తన టీమ్ కి జరిగిన నష్టాన్ని తగ్గించుకోవాలి అనే భావనలో ఉన్నాడని తెలుస్తుంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…