Connect with us

Featured

చిక్కుల్లో హైపర్ ఆది… ఎటూ తేల్చుకో లేక పోతున్నాడట..!!

Published

on

బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచులతో అలరిస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్. ఈ షో వలన చాలా మంది కామెడియన్ లు వెండితెరకి పరిచయం అవడం జరిగింది. అక్కడ కూడా కామిడీయన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ లో హైపర్ ఆది అంటే పంచులకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పొచ్చు. అతని కామెడీ టైమింగ్ తో మంచి స్క్రిప్ట్ లు చేస్తుంటాడు హైపర్ ఆది. కానీ జబర్దస్త్ లో చాలా వరకు వల్గారిటీ ఉంటుందనే ఉంటుందనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ షో కాదు అని అనేవాళ్ళు ఉన్నారు.

అంతే కాకుండా హైపర్ ఆది టీమ్ లో సభ్యులుగా ఉన్న దొర బాబు, పరదేశి మొన్నీమధ్యనే సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటువంటి వల్గర్ కామెడీలు షోలోనే కాకుండా నిజజీవితంలో కూడా చేస్తున్నారు అనే భావన జనాల్లో బలంగా ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత హైపర్ ఆది టీమ్ కి కాస్త నష్టం వాటిల్లింది అనే చెప్పొచ్చు. ఆది టీమ్ కి ఈ సెక్స్ రాకెట్ పెద్ద తలనొప్పిగా తయారైంది. మరోవైపు దీని ప్రభావం హైపర్ ఆది టీమ్ మీదే కాదు మొత్తం జబర్దస్త్ షో మీద కూడా ప్రభావం చూపింది. వైజాగ్ లో వ్యభిచారం చేస్తూ పోలీస్ లకి చిక్కిన దొరబాబు, పరదేశిలు జబర్దస్త్ నటులు కావడం వలన వార్తల్లో పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీనిపై మహిళలు మరియు ఇతర మహిళ సంఘాలు సైతం ఇటువంటి వాటిని ఖండించాలి అని కోరడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ నటులు జబర్దస్త్ లో నటిస్తూ ఉందాత్మతో జనాల్లో కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది.

ఇపుడు దేశంవ్యాప్తంగా లాక్ డౌన్ కొసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం టీవీ ఇండస్ట్రీ మీద కూడా పడింది.. దీనితో అన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి. జబర్దస్త్ యాజమాన్యం సైతం అన్ని బాగుంటే జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ షూటింగ్స్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంది. అయితే కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు మూత పడడంతో ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందువలన జబర్దస్త్ యాజమాన్యం కూడా టీమ్ లలో ఉండే నటులను తగ్గించాలనే ఆలోచన చేశారట, దానికి అనుగుణగానే టీమ్ లీడర్స్ కి టీమ్ లో కొంత మంది నటులను తొలగించాలని చెప్పారట. ఇందులో భాగంగానే దొరబాబు చేసిన పని వలన తన టీమ్ కి నష్టం జరిగినదని భావించిన హైపర్ ఆది మేనేజ్మెంట్ చెప్పిన విధంగా తన టీమ్ నుండి దొరబాబు, పరదేశి లను తొలగించి తన టీమ్ కి జరిగిన నష్టాన్ని తగ్గించుకోవాలి అనే భావనలో ఉన్నాడని తెలుస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!