Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు నటుడు శివాజీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తప్పకుండా టైటిల్ గెలుస్తారని అందరూ భావించారు కానీ చివరి వారాలలో ఈయన వ్యవహార శైలి కారణంగా ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయి టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు రావాల్సి వచ్చింది.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు సందడి చేసిన అనంతరం శివాజీ బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే రెమ్యూనరేషన్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.
తాజాగా శివాజీ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ అమాయకుడని తనకి ఏమీ తెలియదని తెలిపారు. తనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలియక భారీ మొత్తంలో డబ్బు నష్టపోయారని తెలిపారు. ఇక తానే తన యూట్యూబ్ ఛానల్ మానిటైజింగ్ చేశాను అంటూ శివాజీ తెలిపారు..
ప్రశాంత్ అమాయకుడు…
ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి ప్రశాంత్ కంటే తానే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఈయన తెలిపారు. ప్రశాంత్ వారానికి లక్ష రూపాయలకు లోపే రెమ్యూనరేషన్ అందుకున్నారు ఇక ప్రైజ్ మనీతో పాటు మరో రెండు బహుమతులను పొందారు. కానీ శివాజీ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడంతో ఈయన వారానికి నాలుగు లక్షల రూపాయలు అందుకున్నారు. ఇలా 15 వారాలకు ఈయన సుమారు 60 లక్షల వరకు తీసుకున్నారని తెలుస్తుంది. ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని శివాజీ చెప్పకపోయినా విన్నర్ కంటే తానే ఎక్కువగా తీసుకున్నాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…