Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు నటుడు శివాజీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తప్పకుండా టైటిల్ గెలుస్తారని అందరూ భావించారు కానీ చివరి వారాలలో ఈయన వ్యవహార శైలి కారణంగా ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయి టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు రావాల్సి వచ్చింది.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు సందడి చేసిన అనంతరం శివాజీ బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే రెమ్యూనరేషన్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.
తాజాగా శివాజీ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ అమాయకుడని తనకి ఏమీ తెలియదని తెలిపారు. తనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలియక భారీ మొత్తంలో డబ్బు నష్టపోయారని తెలిపారు. ఇక తానే తన యూట్యూబ్ ఛానల్ మానిటైజింగ్ చేశాను అంటూ శివాజీ తెలిపారు..
ప్రశాంత్ అమాయకుడు…
ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి ప్రశాంత్ కంటే తానే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఈయన తెలిపారు. ప్రశాంత్ వారానికి లక్ష రూపాయలకు లోపే రెమ్యూనరేషన్ అందుకున్నారు ఇక ప్రైజ్ మనీతో పాటు మరో రెండు బహుమతులను పొందారు. కానీ శివాజీ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడంతో ఈయన వారానికి నాలుగు లక్షల రూపాయలు అందుకున్నారు. ఇలా 15 వారాలకు ఈయన సుమారు 60 లక్షల వరకు తీసుకున్నారని తెలుస్తుంది. ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని శివాజీ చెప్పకపోయినా విన్నర్ కంటే తానే ఎక్కువగా తీసుకున్నాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























