ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని” స్పష్టం చేశారు.
సంజయ్ గతంలో జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీగా పని చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో ఆయన పాత్ర ఉందన్న చర్చ అప్పట్లో జరిగింది. అయితే, “ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడి పని చేశానని, చంద్రబాబుపై ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని” ఆయన స్పష్టం చేశారు.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పుడు కేసు నమోదు కావడంతో ఈ విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్ను మూడు రోజుల పాటు విచారణకు తీసుకున్నారు.
ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారులు విచారిస్తున్నారు. “మీరైనా నేనైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కదా పని చేయాలి. అవినీతి చేసి ఉంటే కేసులు చుట్టుముట్టేవి కావు” అని సంజయ్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఆయన ఇల్లు, ఆస్తులను కూడా తనిఖీ చేయమని సవాలు విసిరినట్లు సమాచారం.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…