I have nothing to do with Rayudu's murder says MLA Bojjala
తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన రాయుడు హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన దేవుడి సాక్షిగా చెబుతూ క్లారిటీ ఇచ్చారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“తిరుమల స్వామి సన్నిధిలో ఉండి చెబుతున్నా, రాయుడు హత్యతో, అలాగే వినూత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై వైసీపీ రాజకీయ కోణంలో తీవ్ర అభాండాలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడిని హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే అంటూ వారు బాంబు పేల్చారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని కోట వినూత దంపతులు అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…