I have nothing to do with Rayudu's murder says MLA Bojjala
తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన రాయుడు హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన దేవుడి సాక్షిగా చెబుతూ క్లారిటీ ఇచ్చారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“తిరుమల స్వామి సన్నిధిలో ఉండి చెబుతున్నా, రాయుడు హత్యతో, అలాగే వినూత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై వైసీపీ రాజకీయ కోణంలో తీవ్ర అభాండాలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడిని హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే అంటూ వారు బాంబు పేల్చారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని కోట వినూత దంపతులు అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…