Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?
Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలం నుంచి పెళ్లి విడాకులు సహజీవనం అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఇక వీరి గురించి వస్తున్న ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ మీ ఇద్దరి సహజీవనానికి కృష్ణ ఫ్యామిలీ అనుమతి కూడా ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ ఇప్పటికీ తన భర్త అని స్పష్టం చేశారు. ఇంకా మా ఇద్దరికీ విడాకులు రాలేదని రమ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నటుడు నరేష్ తో తనకి ఇంకా సంబంధం తెగిపోలేదని మా ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదని,తాను ఇప్పటికీ విడాకుల పేపర్లపై సంతకం పెట్టలేదు కనుక తను నా భర్త అని చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని రమ్య వెల్లడించారు. ఇకపోతే పవిత్ర లోకేష్ రమ్య గురించి కూడా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తను నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తన కుటుంబం గురించి తాను చూసుకుంటే మంచిదని తెలిపారు.
తను రఘువీరా రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించలేదని ఈ సందర్భంగా రమ్య నరేష్ తో ఉన్న బంధం గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్య వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…