Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు తెలియని వారు ఉండరు. కొండా మురళి, కొండా సురేఖ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ రాజకీయాలు చేసారు. రాజశేఖర్రెడ్డి గారు బ్రతికున్నంత వరకు ఆయన వెంటే ఉన్న కొండా సురేఖ ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డికి కూడా అండగా నిలబడి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ లో మంత్రి పదవికి రాజీనామా చేసారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెరాస లో చేరారు.
వైస్సార్ కు జగన్ కు పొంతన లేదు…
తాజాగా కొండా సినిమా ద్వారా కొండా దంపతుల జీవితం గురించి ఆర్జీవి సినిమా తీసాడు. ఇక ఈ సినిమా విడుదల సందర్బంగా అనేక ఛానెల్స్ లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు కొండా సురేఖ. ఇక ఒక ఇంటర్వ్యూలో వైస్సార్, జగన్ గురించి అడుగగా ఇద్దరికి అసలు పొంతన లేదని చెప్పి షాక్ ఇచ్చింది. వైస్సార్ ఇతరుల ఎదుగుదలను కోరుకుంటారని, కానీ జగన్ అలా కాదని ఆయన ముందు ఇంకొకరు పైకొస్తుంటే ఓర్చలేరని చెప్పారు. వైస్సార్ ఉన్నపుడు జగన్ ఎవరో మాకు తెలియదని వైస్సార్ చనిపోయాకే జగన్ ను కలిశామని అయితే ఆయన వాళ్ళ తండ్రి లాగా కాదని చెప్పారు.
రాజశేఖరరెడ్డి చనిపోయాక వివిధ పార్టీలనుండి పిలుపులు వచ్చాయి. టీడీపీ నుండి కూడా పిలుపు వచ్చిందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి పార్టీ లోకి ఆహ్వానించారాని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా మేము ఎలా టీడీపీ లో ఉంటామని, పరకాలలో టీడీపీ తరుపున దయాకర్ రావు ఉన్నాడు కదా అనగా దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు మీరు టీడీపిలో చేరండి అని పిలిచారట, అలోచించి చెబుతామని వచ్చాక వెళ్లలేదని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…