Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?
Gopichand: టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రముఖ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడుగా ఈయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ అనంతరం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి.
ఈ క్రమంలోనే సిటీ మార్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేది దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన చిత్రబృందం తాజాగా సుమ క్యాష్ కార్యక్రమంలో సందడి చేశారు.
ఈ క్రమంలోనే నటుడు గోపీచంద్ తో పాటు డైరెక్టర్ మారుతి,బన్నీవాసు, శ్రీనివాస కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక సుమ వీరందరికీ గిఫ్ట్ ఇస్తూ వారిచేత డబ్బులు తీసుకుంటుండగా గోపీచంద్ గిఫ్ట్ అని డబ్బులు అడుగుతున్నారు ఏంటి అంటూ తన పై పంచ్ వేసాడు. ఇలా అందరితో కలిసి సరదాగా ఈ కార్యక్రమం కొనసాగిందని తెలుస్తోంది.
ఈ కార్యక్రమం చివర్లో గోపీచంద్ ఫాదర్ ఫోటోని స్క్రీన్ పై వేశారు. తన తండ్రి ఫోటోని చూసిన గోపీచంద్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయానని చిన్నతనంలోనే జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ తెలిపారు. నేను చిన్నప్పుడు ఏం కోల్పోయానో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది అంటూ గోపీచంద్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…