Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా... నటి ఎమోషనల్ కామెంట్స్!
Star Actress: ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్ ఏక్ బార్ అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అందరికీ సుపరిచితమే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేక పోయిన ఈ పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.
అడపాదడపా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు.అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఇక ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో రంగు వివక్షత చాలా ఉంది అంటూ కామెంట్ చేశారు.
ఎక్కువ ఫెయిర్ ఉంటేనే అందం అనుకునేవాళ్ళు ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉన్నారని, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటనా నైపుణ్యం కన్నా కలర్ ఎంతో ఇంపార్టెంట్ అని వెల్లడించారు. ఈ విధంగా కలర్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాలా నలుపు రంగులో ఉన్నవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కొంతమేర సౌత్ ఇండస్ట్రీ ఎంతో మేలని అక్కడ నాలాంటి వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయని ఈషా గుప్తా కామెంట్ చేశారు.ఇకపోతే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో కలర్ కి సంబంధం లేకుండా ఎంతో మంది అవకాశాలు పొందిన వాళ్లు కూడా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఏదిఏమైనా ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…