‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా…’ ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఊపేస్తున్న తాజా ఐటెం సాంగ్. పుష్ప సినిమాలో సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ యమ క్రేజ్ సంపాదించుకుంది. సాంగ్ లో సమంత కవ్వించే స్టెప్పులు.. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్లు… ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ ఇలా అన్ని కుదిరి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.
పాట విడుదలయిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి 4.5 కోట్ల మంది ఈ పాటను చూశారు. ఇదిలా ఉంటే.. ఈ సాంగ్ పై వివాదం కూడా నడుస్తోంది. మీ మగ బుద్దే వంకర బుద్ది అంటూ సాగే పాటపై ఏపీ పురుషుల సంఘం కేసు వేసింది.
మగాళ్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా పాట ఉందంటూ.. కోర్ట్ కెక్కారు. ఈ వివాదంపై నటి మాధవీ లత కూడా స్పందించింది. నేను కూడా కేసు పెడుతా.. అంటోంది. అయితే సమంత సాంగ్ పైన కాదండోయ్.. ‘‘రారా సామీ ’’ సాంగ్ పైన కేసు పెడుతా అంటోంది.
ఇది కూడా పుష్ప మూవీలో సాంగ్ కావడం విశేషం. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇండస్ట్రీలో 98 శాతం పాటలపైన కేసు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒక మగాడు నడిచివెళ్లుతుంటే.. మహిళ తన వెంటే వెళ్తుందా.. ఒక మహిళ పరువు పోయింది. నాకు నచ్చలే అంటూ.. ఫెస్ బుక్ లో పోస్ట్ పెట్టింది మాధవీలత.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…