Director Shankar: సౌత్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరిగంతేస్తారు. శంకర్ తో ఒక సినిమా చేయాలని ప్రతీ హీరో అనుకుంటారు. జెంటిల్ మెన్ తో మొదలైన శంకర్ సినిమాల పరంపర రోబో దాకా సాగింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తాడని…తన సినిమాలో కొత్త కొత్త టెక్నాలజీ వాడుతాడని శంకర్ కు పేరుంది. తను సినిమాలు కూడా బడ్జెట్ కు తగ్గట్టుగానే భారీ వసూళ్లు వసూలు చేశాయి. అంతటి శంకర్ పిలిచి సినిమా చేస్తా అంటే..ఏ హీరో కాదనడు కానీ ఓ హీరో మాత్రం శంకర్ తో సినిమాతో చేయడానికి సిద్దపడలేదు.
అతనెవరో కాదు ‘అబ్బాస్’. ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా అటు తమిళం, ఇటు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. 90 ల్లో ప్రేమ దేశం మానియా లేని యూత్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా పేరు తెచ్చుకుంది.
ఈ సినిమాలోని ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా’ అప్పట్లో ఎంతో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత వరసగా అబ్బాస్ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే భారతీయుడు తీసిని తర్వాత శంకర్ సినిమాలు పెద్దగా ఆడింది లేదు. ఈ క్రమంలోనే ‘జీన్స్’ సినిమా కథ శంకర్ సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమాకు ముందుగా అబ్బాస్ ను అనుకున్న శంకర్..కథను వినిపించాడు. అప్పటికి భారతీయుడు తప్పితే పెద్దగా హిట్ లేని శంకర్ తో సినిమా చేసేందుకు అబ్బాస్ నిరాకరించాడు. మరోవైపు ప్రేమదేశం హిట్ తో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడం కూడా ఇందుకు కారణమైంది. ఆతరువాత అజిత్ వద్దకు వెళ్లిన ఈ కథ.. కాల్షీట్ల కారణంగా చేయలేకపోయాడు. చివరకు ప్రశాంత్ కు కథ వినిపిస్తే ఓకే చేశాడు. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం ఆఫర్లు మిస్ చేసుకున్న ప్రశాంత్ శంకర్ జీన్స్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేసింది. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…