తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పృథ్వి రాజ్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.ఇతను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగుతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఇతను ఖడ్గం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పృథ్వీరాజ్..
ప్రభాకర్ రెడ్డి గారు తన కెరియర్ లో మంచి చేశారో, లేక చెడు చేశారో తెలియదు కానీ ఒక థండరింగ్ ఇచ్చారని పృథ్వీరాజ్ తెలిపారు. అనంతరం గండిపేట రహస్యం సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇందులో మొదట పృథ్వీరాజ్ అశోకగజపతి రాజు రోల్ లో నటించాల్సి ఉండగా, తాను పెద్ద ఆయనలా ఉన్నాను అని చెప్పి వేషం వేయించారు అని పృథ్వి రాజ్ తెలిపారు.
అలాగే ఆ పాత్ర వివాదం అవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఆ సమయంలో పృథ్విరాజ్ అయ్యప్ప మాలలో ఉన్నాడట. అప్పుడు పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి ఒక థియేటర్ కు వెళ్లగా అక్కడ జనాలు పరిగెత్తుకుంటూ కొట్టడానికి వచ్చారని ఆ సమయంలో హరికృష్ణ కారు ఎక్కాలని చెప్పి తన కారులో తీసుకెళ్లారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.
అలా హరికృష్ణ లేకపోతే తనని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టేవారని చెప్పకనే చెప్పేశారు. ఆ సినిమా వల్ల పృథ్వి రాజ్ నాలుగేళ్లు కష్టపడ్డారట. ఈ నేపథ్యంలోనే పృధ్విరాజ్ ముక్కు చెవులు కోస్తామని కూడా బెదిరించారట. ఆ తరువాత ఒకసారి సీనియన్ ఎన్టీఅర్ ని కలిసి కాళ్ళమీద పడిపోయారట.. కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ పాత్రను సీరియస్ గా తీసుకోకపోగా, తాను బ్రహ్మాండంగా పైకి వస్తానని ఎన్టీఆర్ ఆశీర్వదించారని పృథ్వీ రాజ్ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…