దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ప్రతిరోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియంట్లగా రూపాంతరం చెందటం వల్ల ఆర్టీ-పీసీఆర్ టెస్టులలో వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కాలేదు. దీంతో బాధితులకు పాజిటివ్ అని నిర్ధారణ చేయడం ఎంతో కష్టతరం అవుతుంది. పాజిటివ్ అని నిర్ధారణ కాకపోయినప్పటికీ వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పాజిటివ్ నిర్థారణ కాకపోతే తప్పకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలని,ఈ పరీక్షల ద్వారా వైరస్ వ్యాప్తి చెందినదా లేదా అనే విషయం తెలుస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పరీక్షలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
డి-డైమర్ టెస్ట్: ఇది ఒక రక్త నమూనా పరీక్ష. ఈ పరీక్ష వల్ల మన శరీరంలో రక్తంలో ఎక్కడైనా ఉన్న బ్లడ్ క్లాట్ గురించి తెలియజేస్తుంది. దీని విలువ లీటర్ కు 0.5 కన్నా ఎక్కువగా ఉంటే కోవిడ్ గా అనుమానించాలి.
సిఆర్ పీ: దీన్నే సి రి-యాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది లివర్లో తయారవుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులో ఫ్లూయిడ్ శాతం100 ఎంజీ కన్నా ఎక్కువగా ఉంటే ఎంతో ప్రమాదకరం.
ఫెర్రీటిన్: ఈ టెస్ట్ ద్వారా వచ్చే ఫలితం 500కు మించి ఉంటే మన శరీరంలో ఎంతో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.
ఇంటర్ లూకిన్-6: ఈ పరీక్ష ద్వారా మన చాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నది, లేనిది తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా మనం కరోనా బారిన పడ్డామా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులలో నెగెటివ్ అని నిర్ధారణ అయితే తప్పకుండా పై తెలిపిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ లేదా నెగిటివ్ అని నిర్ధారణ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…