Health News

మొటిమలు, కళ్ల చుట్టూ వలయాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

ఎండాకాలంలో ప్రతీ ఒక్కరు ఎక్కువగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దాంతో చర్మంపై ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వేసవి కాలంలోనే వస్తుంటాయి. చర్మాన్ని వివిధ రకాల సమస్యల నుంచి కాపాడుకోవాలంటే మోసాంబి రసం ఉపయోగపడుతుంది. ఫేస్ వాష్, క్రీమ్ సహా అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో మోసాంబి రసాన్ని వాడుతారు.

విటమిన్ సీ కలిగిన సిట్రస్ పండ్లు ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేకూర్చడంతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. చర్మాన్ని పూర్తిగా బిగుతుగా చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా మెరసే విధంగా తోడ్పడుతుంది. అయితే దానిని ఈ విధంగా వాడితే ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం సమయంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి.

ఈ సమస్యతో బాధపడే వారు మోసాంబి రసం అక్కడ అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు చర్మంపై మొటిమలపై కూడా దీనిని అప్లై చేస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మోసాంబి రసం చర్మంలో బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.

మొసాంబి చర్మంపై మచ్చలు, వర్ణద్రవ్యం తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇది ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో పూర్తిగా సహాయపడుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

15 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

16 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

23 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

24 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

24 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago