టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ జోడి లో రాజీవ్ కనకాల-సుమ జోడి ఒకటి అని చెప్పవచ్చు. రాజు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిస్తుంటే, సుమ కూడా గత రెండు దశాబ్దాల నుంచి వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తన దైన శైలిలో గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ జంట వ్యక్తిగత జీవితంలో పలు మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది.
గత కొంతకాలం నుంచి సుమా రాజీవ్ వైవాహిక జీవితంలోపలు మనస్పర్థలు చోటు చేసుకోవటం వల్ల ఇద్దరు వేరువేరుగా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. తాజాగా ఈ విషయంపై రాజీవ్ కనకాల స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.
వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. సుమ నేను వేరువేరుగా ఉంటున్నామనే వార్తలు వినిపిస్తున్నాయి. అవును నిజంగానే మేమిద్దరం వేరు వేరు ఇంట్లో ఉంటున్నాము. అయితే మా మధ్య మనస్పర్థలు తలెత్తి విడిగా ఉండటం లేదని తెలిపారు.
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గారు గురించి మనకు తెలిసిందే. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. అయితే నాన్నను అక్కడినుంచి తీసుకు రావాలనుకుంటే నాన్నకు పెద్ద బుక్ లైబ్రరీ ఉండేది. దానిని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే వీళ్ళు పడకపోవడంతో నాన్న గారి కోసం నేను మణికొండలో ఉన్న ఇంటిలోనే వుండే వాడిని, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని అసలు విషయాన్ని బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…