అరటి పండు అనేది ప్రతీ ఒక్కరు ఇష్టపడే పండు. ఆసుపత్రిలో ఉన్న వాళ్లు ఎక్కుగా దీనిని తీసుకుంటారు. ఇది ముఖ్యంగా శరీరంలోని ఐరన్ లోపాన్ని మెరుగుపరిచి శక్తిని ఇస్తుంది. అరటి పండుతో పాటు పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉదయాన్నే అరటి పండుతో పాటు పెరుగును కూడా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
సాధారణంగా పెరుగులో బ్యాక్టీరియా, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. శరీరానికి ఉల్లసాన్ని అందిస్తాయి. అరటిలో ఉండే ఫైబర్ పెరుగులో ఉండే బ్యాక్టీరియా రెండు శరీరానికి మేలు చేసేవి. ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అలాగే కడుపు నొప్పి సమస్యలను తగ్గిస్తుంది.
ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే అరటి పండు, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. ప్రస్తుత జీవన ప్రపంచంలో బరువుతో బాధపడే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారికి ఇదొక చక్కటి చిట్కాగా పనిచేస్తుంది. బరువు ఎక్కువగా ఉండే వారు దీనిని తీసుకోవడం వల్ల బరువును నియంత్రించొచ్చు. కొవ్వు పెరగకుండా దానిని కూడా అదుపు చేస్తుంది.
ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఇలా ఉదయాన్నే పెరుగు, అరటి పండు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…