Imandi Ramarao : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో అలాయ్ బలాయ్ నిర్వహించారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. రాకరాక మెగాస్టార్ రావడంతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను ప్రవచనాలు చెబుతాను లేదంటే నేను వెళ్ళిపోతాను అంటూ అనడంతో మెగాస్టార్ అభిమానులకు కోపం వచ్చింది. ఇక గరికపాటి గారి మీద కు మెగాస్టార్ అభిమాన సంఘం విమర్శలను ఎక్కుపెట్టింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపు ఇందులోకి వివాదాల జీవి ఆర్జీవి ఎంటర్ అయ్యాడు. ఇక ఆర్జీవి గరికపాటి మీద చేస్తున్నా వరుస విమర్శల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
గరికపాటి ని టార్గెట్ చేసిన ఆర్జీవి…
అనుష్క ను మా అబ్బాయి చూస్తున్నపుడు నేను ఒకసారి అలా చూసాను కన్నార్పకుండా అన్న గరికపాటి ఒక పాత వీడియోలోని మాటలను ఆర్జీవి ప్రస్థావిస్తూ గరికపాటి గారిని విమర్శించారు. ఇక దీనిపై ఇమంది గారు మాట్లాడుతూ ఆర్జీవి మెగాస్టార్ అభిమానిగా గరికపాటి మీద విమర్శలు చేయడం లేదు, కేవలం ఇద్దరూ కొట్టుకుంటే చూసి ఆనందించాలనే సైకో ఆనందంతో ఇలా చేస్తున్నాడు. నిజంగా మెగాస్టార్ అభిమాని అయితే ఇప్పుడు చిరంజీవి కాదు అల్లు అర్జున్ మెగాస్టార్ అంటూ మాట్లాడడు.
అల్లు, మెగాస్టార్ ఫ్యామిలీ మధ్య చిచ్చు మొదట పెట్టిందే ఆర్జీవి అంటూ అభిప్రాయపడ్డారు. ఒకప్పటి ఆర్జీవి ఇపుడు లేడు. అయినా గరికపాటి గారు అనుష్క అందానికి ఆకర్షితుడైనాను అని చెబితే అందులో తప్పేమిటి, ఆయన ప్రవచనకర్త అంతే, ఆయన వర్ణించకూడదు అని లేదు కదా. అలాగే అయినా అసభ్యకరంగా ఏమీ వర్ణించలేదు కదా అంటూ ఇప్పుడు ముగుస్తున్న వివాదాన్ని మరోసారి రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు తప్ప చిరంజీవి మీద అభిమానంతో కాదు అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…