Imandi Ramarao : దివంగత నటి, తమిళనాడు సీఎం జయలలిత మరణం మీద అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న డిఏంకే ప్రభుత్వం ఆమె మరణం మీద సందేహాలు ఉన్నాయని ఆర్ముగం ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఇక ఆ నివేదిక తాజాగా తమిళనాడు అసెంబ్లీని ఉపేస్తోంది. జయలలిత గారి మరణం సహజంగా లేదంటూ, ఆమె మరణించిన సమయం కూడా తప్పుగా నమోదు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ నీవేదికలో పేర్కొనడం ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది. ఇక ఇదే విషయంలో మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు. చివరి రోజుల్లో ఆమె ఎంత దీనస్థితిలో మరణించారో ఆయన తెలిపారు.

కాళ్ళు కట్ చేశారు.. అన్నం కోసం వేడుకుంది…
జయలలిత గారి మరణం వెనుక శశికళ హస్తం ఉంది అంటూ నీవేదికలో పలు అనుమానాలు వ్యక్తం అవడంతో సర్వత్రా ఈ విషయం మీద చర్చ మొదలయింది. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ జయలలిత ఎంతగానో నమ్మిన వ్యక్తి ఆమె ఉండకూడదని అనారోగ్యం పేరుతో హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమె చనిపోయేలా చేసిందంటూ వాఖ్యణించారు. హాస్పిటల్ వెళ్ళాక షుగర్ అంటూ కాళ్ళు కట్ చేసి ఆమె నడవడానికి వీలు లేకుండా చేసేసారు.

ఇక సమయానికి అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ఆమె అన్నం పెట్టమని వేడుకున్నా పెట్టకుండా ఆమెను వేధించారంటూటు ఆయన పేర్కొన్నారు. ఇక ఆమెకు సరైన చికిత్స అందించకుండా చేసి ఆమె మరణానికి కారణమయ్యారని, అంతకుముందు కూడా జయలలిత గారికి స్లో పాయిజన్ ను ఆమె ఆహారంతో పాటు ఇస్తూ ఆమెను అనారోగ్యానికి గురయ్యేలా చేసి చంపేశారని, ఇదంతా శశికళ కుట్ర అంటూ ఇమంది గారు వాఖ్యణించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, స్టాలిన్ ప్రభుత్వం జయలలిత మరణం పై అనుమానాలను వ్యక్తం చేస్తూ కమిటి విధించడం బాగుందంటూ చెప్పారు. ఇక విచారణ జరిపి నిజానిజాలని బయటికి తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.


































