హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ పండుగ మొదటి రోజు భోగి ,భోగి మంటల ద్వారా భోగి భాగ్యాలు లభించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజున ఇంటి ముందు పెద్ద పెద్ద అందమైన ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెట్టి ఘనంగా ప్రత్యేక పూజలలో పాల్గొంటూ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే చివరిగా కనుమ పండుగ. కనుమ పండుగను కూడా ఎంతో పవిత్రంగా భావించి పాడి పశువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. మూడు రోజులపాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..
రైతులు పండించిన పంటలు ఈ పండుగకు ఇంటికి చేరుకుంటాయి. అందువల్ల ఈ పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. అందుకోసమే కనుమ రోజు ఉదయం పశువుల పాక శుభ్రంగా కడిగి పశువులకు స్నానం చేయించి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. అలాగే కొత్త ధాన్యాలతో చేసిన పొంగలిని కూడా మొదటగా పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. రైతు పండించే పంటలో రైతుకు ఎంతో సహాయంగా ఉండటం వల్ల ఈ పండుగను పశువులకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తారని చెప్పవచ్చు. ఈ కనుమ రోజు పశువులకు అలంకరించి పూజలు నిర్వహించిన తరువాత ఈరోజు పశువులతో ఎలాంటి పనులు చేయించరు.
ఈ కనుమ రోజు కుటుంబ సభ్యులు పితృదేవతలను గుర్తు చేసుకుంటూ వారికి నైవేద్యంగా మాంసాహారాన్ని సమర్పిస్తుంటారు. అదే విధంగా కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఈ పండుగకు ఒకచోట చేరుకోవడం వల్ల అందరూ కలిసి సరదా ఉండటం కోసం కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని చెబుతారు. అంతే కాకుండా కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత ఎంతో ప్రాచుర్యంలో ఉంది.కాబట్టి కనుమ రోజు మనకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తిని ఇంట్లో సంతోషంగా గడపడమే, కానీ ఈ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదు. అంతేకాకుండా కనుమ రోజు మినుము తినాలని అనే విషయాన్ని కూడా చెబుతుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల మన శరీరంలో వేడిని కల్పించడం కోసం మినుములు తినాలని సూచిస్తారు. వీటిని తినడం ద్వారా మన శరీరంలో వేడి పెరగటమే కాకుండా తక్షణ శక్తిని కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ కనుమ రోజు కోడి పందాలు, ఎద్దుల బండి పందేలు జోరుగా సాగుతాయి. ఈ విధంగా కనుమను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…