India Today Conclave 2023 : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుండగా ఈ సినిమాలో నటించిన రామ చరణ్, ఎన్టీఆర్ కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ సినిమాలో చరణ్ నటన బాగుందని కొంతంది ఎన్టీఆర్ నటన హైలైట్ అంటూ కొంతమంది వదిస్తూ వస్తున్నారు. కాగా తాజాగా నేడు ఎన్టీఆర్ ను పక్కన పెట్టి ఇండియా టుడే కంక్లెవ్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించడం గురించి చర్చ జరుగుతోంది.
ప్రధాని మోడీ తో కలిసి వేదిక పంచుకోనున్న రామ్ చరణ్…
ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ అలాగే హీరో రామ్ చరణ్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇది నిజంగా తెలుగు వాళ్లకు గర్వకారణం కానీ ఈ విషయాన్ని పక్కన బెట్టి రామ్ చరణ్ ను పిలిచారు ఎన్టీఆర్ ను మిగిలిన ఆర్ఆర్ఆర్ టీంను పక్కన బెట్టారు అంటూ మాట్లాడటం సబబు కాదని ఒక ప్రముఖ అనలిస్ట్ అభిప్రాయపడ్డారు. ప్రధాని కార్యక్రమాలు నిన్న, ఈరోజు షెడ్యూల్ చేయరు వాటిని ఎపుడో ప్లాన్ చేసుంటారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీగా తన 30వ సినిమా షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
అయిన ట్రిపుల్ ఆర్ సినిమా తరుపున రామ్ చరణ్ ను పిలుస్తున్నామని వాళ్ళు చెప్పలేదు కదా. అందునా ఆస్కార్ కి ముందే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయింది. అలాంటపుడు ఇలాంటి చర్చ అనవసరం. గతంలో అమిత్ షా ఎన్టీఆర్ ను పిలిచి ఆర్ఆర్ఆర్ లో ఆయన నటన బాగుందని అభినందించడానికి పిలిచారు గౌరవ విందు ఇచ్చారు. ఆ నాడు రామ్ చరణ్, రాజమౌళి లను పిలవలేదు కదా మరి అపుడు రామ్ చరణ్ ను పక్కనపెట్టినట్లా అంటూ విశ్లేషకులు అభిప్రాయపాడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్చల కన్నా మన తెలుగు వ్యక్తి ప్రధానితో వేదిక పంచుకుంటున్నారని గర్వపడటం ఉత్తమం.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…