ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిపే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స్థానికంగా కాపు ఓటు బ్యాంక్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని రాజకీయంగా బలపరచుకోవాలనే వ్యూహంతో నాగబాబు వరుసగా పర్యటనలు నిర్వహిస్తున్నారని సమాచారం.
ఎచ్చెర్లలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాల ద్వారా గ్రౌండ్ లెవెల్లో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ పర్యటనల్లో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం, సరైన ఆహ్వానాలు అందకపోవడం వంటి అంశాలు ఆయనను అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల అరసవల్లి రథసప్తమి వేడుకలు, సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పటికీ నాగబాబుకు ఆహ్వానం అందలేదన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఆయన శాసన మండలి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం మండలి కార్యదర్శి స్పందించి జిల్లా అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రోటోకాల్ విషయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం అధికార యంత్రాంగం వైఫల్యమేనా లేక స్థానిక రాజకీయ ఒత్తిళ్ల ప్రభావమా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. మిత్రపక్షాల్లోని కొన్ని కీలక నేతల ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఎచ్చెర్ల నియోజకవర్గం ఇప్పటికే టీడీపీ, ఇతర రాజకీయ నేతల ప్రభావంలో ఉండటంతో అక్కడ రాజకీయ సమీకరణలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో నాగబాబు పర్యటనలు కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు నేతలు ఇప్పటికే ఆ నియోజకవర్గంపై దృష్టి సారించగా, ఇప్పుడు నాగబాబు ఎంట్రీతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ పరిణామాల మధ్య కూడా నాగబాబు తన పర్యటనలను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారంలో ఎక్కువ రోజులు ఎచ్చెర్లలోనే ఉండి ప్రజలతో నేరుగా కలిసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. ఉత్తరాంధ్రలో జనసేన పట్టు బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…
పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై దృష్టి పెట్టడం అవసరం అవుతోంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే…
ఎండాకాలం వచ్చేసరికి శరీరానికి చల్లదనం కోసం చాలా మంది పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే…