కేజీఎఫ్ ఛాప్టర్ సినిమా రానంత వరకు అందరు మాట్లాడుకుంది రాజమౌళి గురించే. ఆయన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించారు. హాలీవుడ్ టెక్నాలజీనీ వాడటంతోనూ మన తెలుగు సినిమాకు హాలీవుడ్ సినిమా స్థాయి ఉందని చెప్పడంలోనూ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలే ఉదాహరణ. ఈ రెండు సినిమాలు తెరకెక్కించడానికి రాజమౌళి తీసుకున్న సమయం దాదాపు నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు ప్రభాస్ మరో సినిమా చేయడానికి వీలు లేకుండా పోయింది.
ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు రానా సహా మిగతా ప్రధాన తారాగణం అంతా ఈ ప్రాజెక్ట్లోనే లాకయ్యారు. అయితే అందరు కూడా బాహుబలి ఓ చరిత్ర సృష్ఠించే సినిమా అవుతుందని అలాంటి సినిమా తీస్తున్న రాజమౌళి గురించే మాట్లాడుకున్నారు గాని ఆయన సినిమాల కోసం ఎన్నేళ్ళు తీసుకుంటున్నారని పెద్దగా పట్టించుకోలేదు. సినిమా రిలీజయ్యాక మాత్రం ఈ టాపిక్ వచ్చింది. దీని గురించి రాజమౌళిని అడిగినవారూ ఉన్నారు. దానికి ఆయన చెప్పిన సంమాధానం..బాహుబలి రెండు భాగాలుగా తీసిన సినిమా.
ఇందులో వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికే కొన్ని నెలలపాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. కాబట్టే ఎక్కువ సమయం బాహుబలికి పట్టింది అన్నారు. ఆయన చెప్పిన సమాధానం హాలీవుడ్ సినిమాతో పోల్చుకుని ఓకే అనుకున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్లతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా సమయం తీసుకున్నారు. ఈ సినిమా కమిటవకుండా ఉంటే ఇద్దరు హీరోలు కనీసం మూడేసి సినిమాలు చేసుండేవారు.
అయితే కొంత ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం కావడానికి కరోనా కూడా కారణం అయింది. ఏదేమైనా రాజమౌళి తెరకెక్కించే పాన్ ఇండియన్ సినిమా అంటే రెండేళ్ళు మించిపోతుననే గట్టి నమ్మకానికి వచ్చేశారు. అయితే కేజీఎఫ్ చిత్రాలను తీసిన ప్రశాంత్ నీల్కు మాత్రం అంత సమయం పట్టడం లేదు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న సినిమాలను కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే సంవత్సరం లోపే సినిమాను థియేటర్స్లోకి తెచ్చేస్తాడు.
బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓ రౌత్ కూడా ప్రభాస్తో రూపొందిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ను త్వరగానే పూర్తి చేశాడు. ఈ కారణాల వల్ల ఇప్పుడు ప్రశాంత్ నీల్కు టాలీవుడ్లో వరుసగా పాన్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు అందుకుంటున్నాడు. రాజమౌళి చెక్కి చెక్కీ రెండేళ్ళకు పైగానే సినిమా కోసం తీసుకుంటుంటే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. పైగా బడ్జెట్ విషయంలోనూ ప్రశాంత్ నీల్ తక్కువ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు నిర్మాతలకు కావాల్సింది పాన్ ఇండియన్ సినిమా అయినా బడ్జెట్ లిమిట్లో ఉండాలని. ఇక హీరోలకు ఎంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తైతే అంత త్వరగా మరో ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. ఇన్ని కారణాల వల్లే రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ చేతిలో ఎక్కువ సినిమాలున్నాయి. యష్తో కేజీఎఫ్ 2, ప్రభాస్తో సలార్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నాడు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…