Categories: FeaturedMovie News

రాజమౌళి – ప్రశాంత్ నీల్‌లకు తేడా అదే.. అందుకే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు లాక్ చేసుకుంటున్నారు..!

కేజీఎఫ్ ఛాప్టర్ సినిమా రానంత వరకు అందరు మాట్లాడుకుంది రాజమౌళి గురించే. ఆయన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించారు. హాలీవుడ్ టెక్నాలజీనీ వాడటంతోనూ మన తెలుగు సినిమాకు హాలీవుడ్ సినిమా స్థాయి ఉందని చెప్పడంలోనూ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలే ఉదాహరణ. ఈ రెండు సినిమాలు తెరకెక్కించడానికి రాజమౌళి తీసుకున్న సమయం దాదాపు నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు ప్రభాస్ మరో సినిమా చేయడానికి వీలు లేకుండా పోయింది.

ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు రానా సహా మిగతా ప్రధాన తారాగణం అంతా ఈ ప్రాజెక్ట్‌లోనే లాకయ్యారు. అయితే అందరు కూడా బాహుబలి ఓ చరిత్ర సృష్ఠించే సినిమా అవుతుందని అలాంటి సినిమా తీస్తున్న రాజమౌళి గురించే మాట్లాడుకున్నారు గాని ఆయన సినిమాల కోసం ఎన్నేళ్ళు తీసుకుంటున్నారని పెద్దగా పట్టించుకోలేదు. సినిమా రిలీజయ్యాక మాత్రం ఈ టాపిక్ వచ్చింది. దీని గురించి రాజమౌళిని అడిగినవారూ ఉన్నారు. దానికి ఆయన చెప్పిన సంమాధానం..బాహుబలి రెండు భాగాలుగా తీసిన సినిమా.

ఇందులో వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికే కొన్ని నెలలపాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. కాబట్టే ఎక్కువ సమయం బాహుబలికి పట్టింది అన్నారు. ఆయన చెప్పిన సమాధానం హాలీవుడ్ సినిమాతో పోల్చుకుని ఓకే అనుకున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా సమయం తీసుకున్నారు. ఈ సినిమా కమిటవకుండా ఉంటే ఇద్దరు హీరోలు కనీసం మూడేసి సినిమాలు చేసుండేవారు.

అయితే కొంత ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం కావడానికి కరోనా కూడా కారణం అయింది. ఏదేమైనా రాజమౌళి తెరకెక్కించే పాన్ ఇండియన్ సినిమా అంటే రెండేళ్ళు మించిపోతుననే గట్టి నమ్మకానికి వచ్చేశారు. అయితే కేజీఎఫ్ చిత్రాలను తీసిన ప్రశాంత్ నీల్‌కు మాత్రం అంత సమయం పట్టడం లేదు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న సినిమాలను కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే సంవత్సరం లోపే సినిమాను థియేటర్స్‌లోకి తెచ్చేస్తాడు.

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓ రౌత్ కూడా ప్రభాస్‌తో రూపొందిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్‌ను త్వరగానే పూర్తి చేశాడు. ఈ కారణాల వల్ల ఇప్పుడు ప్రశాంత్ నీల్‌కు టాలీవుడ్‌లో వరుసగా పాన్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు అందుకుంటున్నాడు. రాజమౌళి చెక్కి చెక్కీ రెండేళ్ళకు పైగానే సినిమా కోసం తీసుకుంటుంటే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్  సినిమాను పూర్తి చేస్తున్నాడు. పైగా బడ్జెట్ విషయంలోనూ ప్రశాంత్ నీల్ తక్కువ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు నిర్మాతలకు కావాల్సింది పాన్ ఇండియన్ సినిమా అయినా బడ్జెట్ లిమిట్‌లో ఉండాలని. ఇక హీరోలకు ఎంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తైతే అంత త్వరగా మరో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళొచ్చు. ఇన్ని కారణాల వల్లే రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ చేతిలో ఎక్కువ సినిమాలున్నాయి. యష్‌తో కేజీఎఫ్ 2, ప్రభాస్‌తో సలార్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 minutes ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

17 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

17 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

19 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

19 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

21 hours ago